ముషీరాబాద్, జోన్ బృందం ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను నియోజకవర్గంలో గురువారం పండుగలా నిర్వహించారు. పలు డివిజన్లలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్లు కట్ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలు, పారిశుధ్య కార్మికులకు దుస్తులు, పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లు, బ్రెడ్లు, నోట్ బుక్కులు, వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీతోపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముషీరాబాద్ పార్శిగుట్ట చౌరస్తాలో టీఆర్ఎస్ సీనియర్ నేత సోమసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని అన్నారు. ముషీరాబాద్ చౌరస్తాలో శివముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆశ వర్కర్లు, పారిశుధ్య కార్మికులకు జ్యూస్ పంపిణీ చేసి రెయిన్బో ఆశ్రమంలో అన్నదానం చేశారు. టీఆర్ఎస్ ముషీరాబాద్, భోలక్పూర్ డివిజన్ల అధ్యక్షులు కాబోయిన నర్సింగ్ ప్రసాద్, శ్రీనివాసరావు, నాయకులు ఆకుల అరుణ్, సునీల్, అహ్మదుల్లా, లక్ష్మణ్ గౌడ్, బల్ల ప్రశాం త్, గోవింద్, ఉమామహేశ్వరి, శోభ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేసి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మనోహర్సింగ్, సుదేశ్, గురుదీప్ సింగ్, అమరం వినోద్, రజినీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. అడిక్మెట్ ఎస్వీఎస్ స్కూల్లో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని కేక్ కట్ చేయగా డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్, మాజీ కార్పొరేటర్ హేమలతారెడ్డి, ప్రేమలతారెడ్డి, అనురాధ, ప్రసన్న, జెల్ల మాధవి, నేత శ్రీనివాస్, శ్యామ్సుందర్, సయ్యద్ అస్లాం, మాదవ్, ప్రవీణ్ పాల్గొన్నారు. రాంనగర్లో డివిజన్ అధ్యక్షుడు మోజెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పార్శిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎర్రం శేఖర్, ముదిగొండ మురళీ తదితరులు పాల్గొన్నారు.