హైదరాబాద్ : ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్, అధికారులతో పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల సమస్యకు శాశ్వత పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం చూపుతుందని, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతోనే ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద నాలాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద నగరంలో అనేక నాలాల అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. నాలాలపై ఉన్న ఆక్రమలను పూర్తి స్థాయిలో తొలగిస్తామని స్పష్టం చేశారు. నాలాల అభివృద్ధితో పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులు పరిష్కారమవుతాయన్నారు.