ఏర్గట్ల : ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం ఏర్గట్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ , మండల నాయీ బ్రాహ్మణ సంఘ భవనాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆభివృద్ధిపై ఇతర రాష్ట్రల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెలంగాణ హయాంలో జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ , టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణనందం, తాసీల్దార్ సురేశ్ , ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్ , వైస్ ఎంపీపీ సల్ల లావణ్య, కో-ఆప్షన్ సభ్యుడు అస్రాఫ్ , సొసైటీ చైర్మన్లు బర్మ చిన్న నర్సయ్య, పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లు గుల్లే లావణ్య, భీమనాతి భాను ప్రసాద్ , కుండ నవీన్ , పత్తిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, టీఆర్ ఎస్ మండల నాయకులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్ , గుల్లే గంగాధర్ , సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు రంజిత్తో బాటు 150 మంది యువకులు శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.