హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగు కొనసాగుతున్నది. బుధవారం వరకు 1.09 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. నిరుడు ఇదే సమయానికి 1.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం సుమారు 2.5 లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు సాగవుతున్నట్టు తెలిపింది. సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యం 1.24 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే ఇందులో 88.37 శాతం పంటలు సాగవుతున్నాయి. ఇక మొత్తం సాగులో అత్యధికంగా వరి 49.21 లక్షల ఎకరాల్లో సాగు కాగా, పత్తి 45.03 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొక్కజొన్న 5.15 లక్షల ఎకరాల్లో, కంది 4.57 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి.