న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపాల్టీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఒకవేళ ఎవరైనా మాస్క్ పెట్టుకోకుంటే, వారిపై రూ.500 జరిమానా విధించనున్నట్లు డీడీఎంఏ ఆదేశించింది. కొన్ని స్కూళ్లలో కొత్తగా కేసులు నమోదు అవుతున్నా.. స్కూళ్లను మాత్రమే మూసివేసేది లేదని అధికారులు చెబుతున్నారు.