న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ( Aravind Kejriwal ) చెప్పారు. ఈ ఉదయం ‘ఢిల్లీ కీ యోగశాల’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కేజ్రివాల్ మీడియాతో మాట్లాడారు. ‘మేం ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే తప్పకుండా ఆంక్షలు విధిస్తాం. ప్రస్తుతమైతే ఆంక్షలు విధించాల్సిన అవసరం కనిపించడంలేదు’ అని కేజ్రివాల్ అన్నారు.
అదేవిధంగా ఢిల్లీలో పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారా..? అన్న మీడియా ప్రశ్నకు.. ‘ప్రస్తుతం ఢిల్లీలో స్కూళ్లకు శీతాకాల సెలవులు కొనసాగుతున్నాయి. శీతాకాల సెలవులు ముగిసిన అనంతరం పాఠశాలలను పునఃప్రారంభించే విషయంలో నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.