న్యూఢిల్లీ, జూన్ 9: లైంగికదాడులను ప్రోత్సహించేలా యాడ్లను రూపొందించిన పర్ఫ్యూమ్బ్రాండ్ లేయర్పై కేసు నమోదైంది. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతీ మలివాల్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు.
అయితే యాడ్స్పై ఇటీవలే క్షమాపణ చెప్పిన కంపెనీ.. అన్ని అనుమతులు తీసుకున్నాకే ఈ ప్రకటనలను జారీ చేశామని తెలిపింది. వివాదం నేపథ్యంలో ప్రకటనలను నిలిపివేయాలని టీవీ, ఇతర మాధ్యమాలను కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే.