న్యూఢిల్లీ: మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులతో రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపు(bomb threat) వచ్చింది. ఓ ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి గురువారం రాత్రి ఆ బెదిరింపు మెయిల్ వచ్చింది. బెరిరింపు మెయిల్తో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ వద్ద సెక్యూర్టీని పెంచారు.
బాంబు బెదిరింపు వచ్చిన విమానాన్ని చెక్ చేశామని, దాంట్లో ఏమీ గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఆ విమానాన్ని వేరు చేశామని అధికారులు వెల్లడించారు. అయితే ఆ విమానం మాస్కో నుంచి ఢిల్లీకి ఇవాళ తెల్లవారుజామున ౩.2౦ నిమిషాలకు చేరుకున్నట్లు పోలీసులు చెప్పారు.
గురువారం రాత్రి 11.15 నిమిషాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని, మాస్కో నుంచి మూడవ టర్మినల్కు చేరుకోవాల్సిన ఆ విమానంకు బెదిరింపు వచ్చిందన్నారు. 29వ రన్వేపై ఫ్లయిట్ SU232 ల్యాండ్ అయినట్లు అధికారులు చెప్పారు. ఆ విమానంలో మొత్తం 386 మంది ప్రయాణికులు, మరో 16 మంది సిబ్బంది ఉన్నారు. బాంబు బెదిరింపు అంశాన్ని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 10వ తేదీన కూడా ఓ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. లండన్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లయిట్కు ఆ బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే.