న్యూఢిల్లీ, జనవరి 31: కొవిడ్ మహమ్మారి దేశ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, పాఠశాలల్లో 6-14 ఏండ్ల మధ్య వయసు ఉండే గ్రామీణ ప్రాంత చిన్నారుల నమోదు తగ్గిందని 2021-22 ఆర్థిక సర్వే వెల్లడించింది. ఎఎస్ఈఆర్(రూరల్) నివేదిక ప్రకారం 2018లో ఎన్రోల్ చేసుకోని వారి సంఖ్య 2.5 శాతం ఉండగా, 2021లో అది 4.6 శాతానికి పెరిగిందని తెలిపింది. 7-10 ఏండ్ల చిన్నారుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుదల ఎక్కువగా ఉందని, బాలికల కంటే బాలురుల్లో అధికమని పేర్కొన్నది. కొవిడ్ నేపథ్యంలో విద్యా బోధన ఆన్లైన్కు మారడంతో డిజిటల్ విభజన పెరిగిందని తెలిపింది.