హిమాయత్నగర్, డిసెంబర్ 26: ‘స్వామి యే శరణం అయ్యప్పా.. శరణం శరణం అయ్యప్పా.. స్వామి శరణం అయ్యప్పా’ అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో నారాయణగూడ మార్మోగింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీ అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. ఆత్రేయ గురుస్వామి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో సుమారు ఐదువేల మంది అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప నామ స్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.
అనంతరం, స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే కాలేర్ వెంకటేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్య క్షురాలు గీతామూర్తి, కార్పొరేటర్లు జి.మహాలక్ష్మి,అమృత,కన్నే ఉమా రమేష్ యాదవ్, పద్మావతిరెడ్డి, సుప్రియా గౌడ్, మాజీ ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ నగర అధ్యక్షుడు గౌతమ్రావు, నాయకులు జి.రామన్ గౌడ్, వెంకట్రెడ్డి, కేశబోయిన శ్రీధర్, జైస్వాల్,పందిర్ల ప్రసాద్తో పాటు కిషన్రెడ్డి సతీమణి కావ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.