నీలగిరి, మార్చి 5: రా్రష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన 518 మంది లబ్ధిదారులకు మార్చి 31 నాటికి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. శనివారం వివిధ శాఖల, అధికారులతోపాటు ఆరు నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 518 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని, మార్చి 31 నాటికి గ్రౌండింగ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందిని ఎమ్మెల్యేల ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గ ప్రత్యేక అధికారుల ద్వారా ఎంపీడీఓలకు అందజేశామని, నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం లబ్ధిదారుల పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశం పాల్గొన్నారు.