న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో (Delhi airport) తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానం వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఓ ప్రయాణికుడి వద్ద పిస్టల్ను గుర్తించారు. దీంతో విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. బ్యాగ్లో తుపాకీతోపాటు రెండు మ్యాగజైన్లను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పూర్తిగా తనిఖీ చేసిన బ్యాగ్లో పిస్టల్ ఎలా తీసుకొచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పిస్టల్తో ఉన్న బ్యాగ్ను విమానం లోపలికి ఎలా అనుమతించారని ఎయిర్లైన్స్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడిపై ఆర్మ్ యాక్ట్కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.