ఢిల్లీ , జూన్ 6: లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో సి.ఎస్.ఐ.ఆర్. ఇండియా కరోనా చికిత్స కోసం యాంటీ-హెల్మినిటిక్ ఔషధం “నిక్లోసమైడ్” రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల చికిత్స కోసం “నిక్లోసమైడ్” సమర్థత, భద్రత ను అంచనా వేయడానికి, మల్టీ-సెంట్రిక్, ఫేజ్-2, రాండమైజ్డ్, ఓపెన్ లేబుల్ క్లినికల్ అధ్యయనంలోభాగంగా ఈ పరీక్షలు చేపట్టారు. పెద్దవాళ్లలో,పిల్లల్లో చికిత్స కోసం నిక్లోసమైడ్ గతంలో విస్తృతంగా ఉపయోగించారు. .
“నిక్లోసమైడ్” ఉపయోగించి రెండవ దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి ఎస్.ఈ.సి. సిఫారసులపై సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే, సంతోషం వ్యక్తం చేశారు.ఇదిఅందుబాటు ధరలో ఉండే ఔషధం భారతదేశంలో లభిస్తుంది.అందువల్ల మన జనాభాకు అందుబాటులో ఉంచవచ్చునని ఆయన తెలిపారు.