హైదరాబాద్: బీఆర్కే భవన్లో ఉద్యోగుల కోసం చేపట్టిన రెండో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ను శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్తో సహా సచివాలయ ఉద్యోగులకు జూన్ 11, 12 తేదీల్లో రెండురోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఏర్పాటు చేసి మొదటి విడత టీకాలు పంపిణీ చేశారు.
ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల ఉద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీఏడీ జాయింట్ సెక్రెటరీ చిట్టిరాణి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.