ఖమ్మం : సమగ్రశిక్ష ఉద్యోగులకు 30 శాతం వేతనం పెంపునకు కృషి చేసిన ఆర్ధికశాఖ మంత్రి హరీష్రావును సీఆర్పీల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. వేతనాలు పెరగడంతో అందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, సహాదేవ్, జానకీరామ్, మహేందర్, షేక్ మహబూబ్పాషా, చందు తదితరులు పాల్గోన్నారు.