హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావుకు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని టీపీసీసీ నేత రేవంత్రెడ్డి నోరుపారేసుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విధానాలే ప్రాతిపదికగా పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలపై చెత్తవాగుడు మానుకోవాలని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికలో మతోన్మాద బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలు ముందుకు సాగుతున్నాయని స్పష్టంచేశారు. బీజేపీని నిలువరించడం, ఓడించడం ప్రధాన లక్ష్యంగా ఎంచుకోకుండా టీఆర్ఎస్ను టార్గెట్గా పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకే నష్టమని హితవు పలికారు.