న్యూఢిల్లీ: కోవిడ్ బూస్టర్ డోసులను ఉచితంగా ఇవ్వాలని సీపీఐ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆదివారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసులను ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రైవేటు దావాఖానాలో ఆ డోసులకు కనీసం రూ.400 వరకు అవుతోందని, ఆ బూస్టర్ టీకాలను ఉచితంగా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వ దవాఖానాల్లో దేశవ్యాప్తంగా ఉచితంగా ఆ టీకాలను ఇవ్వాలని వేడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున సమీక్షించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రైవేటు పరం చేయడం సమంజసంగా లేదని, దీని వల్ల ఆ ప్రోగ్రామ్ నిర్వీర్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎంపీ విశ్వం తన లేఖలో తెలిపారు. బూస్టర్ డోసులకు ధరను నిర్ణయించడం వల్ల.. అవి నిరుపేదలకు దూరం అవుతాయన్నారు.