కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండటంతో రాచకొండ పోలీసు సిబ్బందికి సీపీ మహేశ్ భగవత్ హెల్త్క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం ఉస్మానియా దవాఖాన వైద్యులతో ప్రత్యేక హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి.. కొవిడ్ బారిన పడినవారికి, పడని వారికి వైద్యులు సూచనలు చేశారు. ప్రత్యేక పరికరం పెరిస్కోప్తో 250 మంది సిబ్బందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు ఆర్కే సహాయ్, వైభవ్ డిండే, యూనిట్ డాక్టర్ సరిత , జెనిసిస్ మెడికల్ సిస్టమ్స్ రవి జాలి, విజయ్ సురేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారికి సీపీ మెమొంటోలు అందించారు.