హైదరాబాద్ : పలు దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో 12 మంది కరోనా పాజిటివ్గా పరీక్షించారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన వారికి.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా బారినపడ్డట్లు గుర్తించారు. దీంతో అధికారులు వారిని గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించి, చికిత్సలు అందిస్తున్నారు. 12 మంది ప్రయాణికుల్లో యూకే నుంచి తొమ్మిది మంది, సింగపూర్, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
కరోనా పాజిటివ్గా తేలిన ప్రయాణికుల నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. నిన్న బ్రిటన్ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన కరోనా పాజిటివ్గా పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా 12 మంది వైరస్ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 13కు పెరిగింది.