పనాజీ : కేరళలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఇప్పటికే అధికారులు గోవాలో ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ ఈ నెల 20 వరకు అధికారులు పొడగించారు. తీరప్రాంతంలో కాసినోలతో సహా అనేక కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతున్నది. రాష్ట్రంలో 24 గంటల కర్ఫ్యూ గత సంవత్సరం మే 9న మొదటిసారి విధించారు. ప్రభుత్వం అప్పటి నుంచి పలు నిబంధనలు సడలిస్తూ పొడగిస్తూ వస్తోంది.
స్థానికంగా ప్రభుత్వం పర్యాటక ప్రాంతంలో మెజారిటీ కార్యకలాపాలను ప్రారంభించింది. కానీ, క్యాసినోలు ఇంకా తెరువలేదు. ఆదివారం జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం కేరళ నుంచి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులందరూ రోజుల పాటు సంస్థాగత నిర్బంధంలో ఉండాలని, విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు విద్యా సంస్థల నిర్వాహకులు చేస్తారని పేర్కొంది. ఉద్యోగుల కోసం సంబంధిత కంపెనీలు, సంస్థలు చేస్తాయని పేర్కొంది. క్వారంటైన్ ముగిసిన అనంతరం కొవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది.