హైదరాబాద్ : మెదక్ మండలం బొల్లారంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కూతురుతో కలిసి దంపతులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టుకొని చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో శ్రీనివాస్ (40) అనే వ్యక్తి, అతని కూతురు కృతి (11) మృతి చెందారు. గ్రామస్తులు శ్రీనివాస్ భార్య లావణ్యను కాపాడి ఆసుప్రతికి తరలించారు. మెదక్ ఏరియా ఆసుప్రతిలో చికిత్స పొందుతుండగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్ బొల్లారంలో ఆటో డ్రైవర్గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.