యాదాద్రి : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కలలో సైతం ఊహించని విధంగా యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ పునర్నిర్మించారన్నారు. నిర్మాణంలో లోపాలు లేకుండా నిర్మించారన్నారు. గోదావరి జలాలను యాదాద్రికి తీసుకొచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. భవిష్యత్ తరాలు కూడా కేసీఆర్ను గుర్తుంచుకునేలా ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టారన్నారు. సీఎంకు మరింత శక్తి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించానన్నారు.