నల్లగొండ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 18 మంది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరై 454600 రూపాయల చెక్కులను నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలకు సహాయాన్ని అందిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ఆపత్కాలంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.