హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావుగౌడ్ కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా.. నగరంలోని నిమ్స్ దవాఖానలో టీకా వేయించుకోగా, పద్మారావుగౌడ్ సికింద్రాబాద్లోని దవాఖానలో వ్యాక్సిన్ తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా రెండో విడుత వ్యాక్సినేషన్ ఈ నెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో టీకా తీసుకున్నారు. రెండో విడుతలో భాగంగా 60 ఏండ్లు పైబడినవారికి, 45 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు