యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఆదివారం మరో 32 మంది సిబ్బందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
దీంతో వైరస్ బారినపడిన సిబ్బంది సంఖ్య ఇప్పటివరకు 68 చేరింది.
శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కరోనా కేసులు వెలుగుచూడటంతో ఈ నెల 30 వరకు ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
భక్తులకు స్వామి లఘు దర్శనం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.