హైదరాబాద్ : బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషి చెన్నయ్యకు నాంపల్లిలోని మొదటి అదనపు ఎంఎస్జే కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానాగా విధించింది. కేవలం నాలుగున్నర నెలల్లోనే నేరస్తుడిని గుర్తించడంతో పాటు శిక్ష పడేలా చేసిన బంజారాహిల్స్ పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు.