గాజా, ఆగస్టు 6: గాజా సిటీలోని మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జెట్ విమానాలు విరుచుకుపడ్డాయి. ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపు లక్ష్యంగా శుక్రవారం ప్రారంభమైన ఈ దాడుల్లో ఓ సీనియర్ మిలిటెంట్, ఐదేండ్ల చిన్నారి సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
శనివారం మధ్యాహ్నం గాజాలోని సభ్యుడి ఇంటిని లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ రెండు బాంబులను జారవిడిచింది. దీంతో ఆ భవనం నేలమట్టమైంది. గాజాకు చెందిన హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య గత 15 ఏండ్లుగా నాలుగు భారీ యుద్ధాలు, అనేక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.