అంబర్పేట, మార్చి 10: రెండో భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చాలని కుట్ర పన్నిన భర్తతో పాటు అతనికి పిస్టల్ సమకూర్చడంలో సహకరించిన మరో ఇద్దరిని చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, అంబర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజిగిరి, మారుతీనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దామ ర అరుణ్కుమార్(48) తన రెండో భార్య నిషితారాణిపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం గత ఏడాది నవంబర్లో మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బును సంప్రదించి తుపాకి కావాలని కోరా డు.
అబ్బు ద్వారా యాకుత్పురా కు చెందిన మీ ర్ ముజమ్మిల్ తుపాకీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చా అరుణ్కుమార్ వద్ద రూ.20వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అనంతరం అరుణ్కుమార్ తన పొలంలో తుపాకీ ని పరీక్షించి చూశాడు. మార్చి 9వ తేదీన తన భార్యను చంపే ప్రణాళికలో భాగంగా నిందితులు అంబర్పేట అలీకేఫ్ వద్ద సమావేశమవ్వ గా, అంబర్పేట పోలీసులు ఎస్సై అంజిరెడ్డి, కా నిస్టేబుళ్లు వంశీకృష్ణ, శ్రీధర్లతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీ డిక్కీలో ఒక దేశీయంగా తయారు చేసిన తుపాకీ, 6 రౌండ్లు లభ్య మయ్యాయి. అదుపులోకి తీసుకొని విచారించగా హత్య కుట్ర కోణం బయటపడింది.