బెంగళూరు: బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక పోలీసుల జులుం ప్రదర్శించారు. కాంగ్రెస్ కార్యకర్త ధరించిన ‘పేసీఎం’ టీషర్ట్ను బలవంతంగా విప్పించారు. అతడిపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’, బీజేపీ పాలిత తొలి రాష్ట్రమైన కర్ణాటకకు చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్త అక్షయ్ కుమార్ ‘భారత్ జోడో యాత్ర’లో శనివారం పాల్గొన్నాడు. ‘PayCM’ అని రాసి ఉన్న టీ-షర్టును అతడు ధరించాడు. దీనిని గమనించిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్త అక్షయ్ కుమార్ ధరించిన టీ షర్ట్ను బలవంతంగా విప్పించారు. అలాగే పోలీసులు అతడిపై పిడికిలితో పంచ్లు ఇచ్చారు.
మరోవైపు మీడియా రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘పేసీఎం’ టీ-షర్టు ధరించిన తమ కార్మికుడిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఆ వ్యక్తి టీషర్ట్ను తొలగించి దాడి చేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించింది. వీరు పోలీసులా లేక గూండాలా? అని విమర్శించింది. దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఆయన ప్రభుత్వం ప్రజా పనులపై 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆరోపించింది. కాంట్రాక్టర్ల ఆత్మహత్యాయత్నం కేసుల సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో క్యూఆర్ కోడ్ కలిగిన ‘PayCM’ పేరుతో ఉన్న పోస్టర్లు ఆ రాష్ట్రంలో పలు చోట్ల వెలిశాయి.
#PayCm ಟಿ ಶರ್ಟ್ ಧರಿಸಿದ್ದ ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತನ ಮೇಲೆ ಪೊಲೀಸರು ದಬ್ಬಾಳಿಕೆ ನಡೆಸಿರುವುದು ಖಂಡನೀಯ.
ಟಿ ಶರ್ಟ್ ಬಿಚ್ಚಿಸಿ ರಸ್ತೆಯಲ್ಲಿ ಆತನ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಸಲು ಪೊಲೀಸರಿಗೆ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟವರು ಯಾರು? ಇವರೇನು ಪೊಲೀಸರೊ ಅಥವಾ ಗೂಂಡಾಗಳೋ? ಹಲ್ಲೆ ನಡೆಸಿದ ಅಧಿಕಾರಿಯನ್ನು ಈ ಕೂಡಲೇ ಅಮಾನತು ಮಾಡಬೇಕು.@DgpKarnataka @JnanendraAraga pic.twitter.com/zDO2aseCaN
— Karnataka Congress (@INCKarnataka) October 1, 2022