తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆపేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం ములుగు జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపై రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, రెడ్కో చైర్మన్తో కలిసి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం, విలేకరుల సమావేశం నిర్వహించగా నాగజ్యోతి మాట్లాడారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసి కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తుంటే కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రెడ్కో చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో రైతు బంధు నిలిపివేయాలనడం అంటే రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. ఇలాంటి కుట్రలను మానుకొని రైతుల మేలుకు సహకరించాలని డిమాండ్ చేశారు.
ములుగురూరల్, అక్టోబర్ 26 : రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నాయకులు ఆపే కుట్రలు చేస్తున్నారని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సందర్భంగా గురువారం బీఆర్ఎస్ పట్టణ కార్యాలయంలో రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి నాగజ్యోతి విలేకరులతో మాట్లాడారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు దిక్కు తోచక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతం మంది రైతులు న్నారని, వారికి రైతు బంధు నిలిపివేయాలనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. బీడు భూముల తెలంగాణను సస్యశ్యామలం చేసి రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తుంటే కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాక ముం దే ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారికి కూడా రైతు బంధు పథకాన్ని వర్తిం పజేస్తున్న బీఆర్ఎస్ విధానాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలో కరువును తెచ్చే కాంగ్రెస్ పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రశ్నించే గొంతునని స్టేజీల మీద చె ప్పుకునే ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ నాయకుల విధానాన్ని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యే సీతక్కకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లను కూడా కాంగ్రెస్ నాయకులు రద్దు చేయాలంటున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. 2018లో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో పాటు దళిత బంధు పథకాన్ని కూడా ఆపాలనడం కాంగ్రెస్ నాయకుల ఓటమి, భయానికి నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో 46లక్షల మందికి ఆసరా ఫించన్లు అందుతున్నాయని, ప్రజల బాగోగులు ఏ నాడు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అందుతున్న పథకాలను కూడా ఆపాలని అంటున్నారు.
– రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి
ఓటమి భయంతోనే సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ అగ్ర నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10 సీట్లు కూడా గెలవలేమనే పరిస్థితిని తెలుసుకొని ఈ పనులకు పూనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు పాలిస్తున్న కర్ణాటకలో రైతులు రోడ్డెక్కిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలను వద్దంటున్న కాంగ్రెస్ నాయకులు రేపు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను చెప్పులతో కొట్టి నిలదీయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్యాదవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, నాయకులు పోరిక ధరమ్సింగ్, భూక్యా దేవ్సింగ్, వెల్పూరి సత్యనారాయణరావు, బేతెల్లి గోపాల్రెడ్డి, గజ్జి నగేశ్, కాకి పురుషోత్తం, భూక్యా మురళి, ఆదిరెడ్డి, శరత్ పాల్గొన్నారు.
ములుగులో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
తెలంగాణలో రైతు బంధు, సంక్షేమ పథకాలను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ములుగు మండల ఎన్నికల ఇన్చార్జి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైటాయించి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సతీశ్రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు నిలిపివేయాలని కాంగ్రెస్ కుట్ర చేయడం అంటే రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఇలాంటి కుట్రలను మానుకొని రైతుల మేలుకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా గత సంక్షేమ పథకాలు కొనసాగించవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పినా రేవంత్రెడ్డి కుట్ర పూరితంగా వ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతులు వెంట పడి తరమాలని పిలుపునిచ్చారు.