చండీగఢ్, అక్టోబర్ 20: గ్రామానికి ఏం సేవ చేశారని అడిగినందుకు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్, ఆయన భద్రతా సిబ్బంది హర్ష్కుమార్ అనే యువకుడిపై దాడి చేశారు. భోవా అసెంబ్లీ స్థానం నుంచి జోగిందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో హర్ష్కుమార్ ప్రశ్నించాడు. ఎమ్మెల్యే దాడిపై పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా స్పందించారు. ఎమ్మెల్యేలు ఉన్నది ప్రజా సేవ చేయడానికేనని, ఒక ఎమ్మెల్యే ఇలా చేయడం తగదని అన్నారు. జోగిందర్ యువకుడిని కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.