ధర్మపురి : నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ పటిష్టానికి కృషి చేయాలని సూచించారు.
టీఆర్ఎస్లో చేరిన వారిలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సయ్యద్ షకీల్, మైనారిటీ మండల అధ్యక్షుడు షేక్ ఖాలీద్ సయ్యద్ ఇస్మాయిల్, సయ్యద్ జావీద్, షేక్ రఫీక్ ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గొస్కుల జలంధర్, ఎంపీపీ నక్క శంకరయ్య, పాక్స్ చైర్మన్ మాధవరావు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బొల్లం రమేశ్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకులు పాదం తిరుపతి, పాదం రమేశ్, నాయకులు పాల్గొన్నారు.