న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ నలుపు రంగు దుస్తుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. అయితే వాళ్లకు మద్దతుగా ఇవాళ సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు నల్లు దుస్తులు వేసుకున్నారు. రాహుల్ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకోగా, ప్రియాంకా బ్లాక్ సూట్ వేసుకున్నారు. ప్రధాని మోదీని హిట్లర్తో పోల్చారు రాహుల్. హిట్లర్ కూడా ఎన్నికలు గెలిచాడని, అతను ఎలా గెలిచాడనుకుంటున్నారు, జర్మనీలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడని, నాకు వ్యవస్థను పూర్తిగా అప్పగిస్తే, అప్పుడు ఎన్నికలు ఎలా గెలవాలో చూపిస్తానని రాహుల్ అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రియాంకా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.