నారాయణపేట : నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేశారు. మున్సిపాలిటీ మొదటి వార్డులో బీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన అలవేణి రాజశేఖర్ రెడ్డిపై దాడికి యత్నించారు.
అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డం వచ్చిన వారిని నెట్టిపారేశారు. కాంగ్రెస్ గూండాల దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.