కలబురగి: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సొంత జిల్లా కలబురగి ప్రజలను ఆకట్టుకునేందుకు భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ జిల్లాలోని అఫ్జల్పుర్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడం మీకు ఇష్టం లేకపోయినప్పటికీ, కలబురగి కోసం పని చేశానని భావిస్తే, కనీసం తన అంత్యక్రియలకు హాజరుకావాలని కోరారు.
“మీరు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే, నాకు కలబురగిలో ఇక స్థానం లేదని, నేను మీ మనసు గెలుచుకోలేదని భావిస్తాను” అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని ఓడించేందుకు తాను రాజకీయాల్లో తుది శ్వాస వరకు కొనసాగుతానని చెప్పారు.