నవాబ్పేట, నవంబర్ 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో వరి పండించిన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొల్లూరు, బట్టోనిపల్లితండా, కేశవరావుపల్లి, కామారం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కొల్లూరు రెవెన్యూ శివారులో దశాబ్దాల నుంచి సాగవుతున్న రైతుల భూములను పరిశీలించారు. కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం కేశవరావుపల్లి శివారులో మొక్కజొన్న నూర్పిడి చేస్తున్న రైతులతో ముచ్చటించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చే యాసంగి సీజన్లో వడ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పుకోవడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. అందుకే ఆరుతడి పంటలే పండించాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా రైతులకు సహకారం అందిస్తున్నదని చెప్పారు. అనంతరం కామారంలో సెల్ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. నేటికీ గ్రామంలో సిగ్నల్స్ రాక ఫోన్లు కలవడం లేదని స్థానికులు వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి త్వరలో టవర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోశ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు, రైతుబంధు మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు తాహెర్, సర్పంచులు గోపాల్గౌడ్, సౌజన్యరఘు, రజినీ రమేశ్, కృష్ణయ్య, ఎంపీటీసీ రాధాకృష్ణ, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, చందర్నాయక్, నారాయణ, నెత్తికొప్పుల నర్సింహులు, సేవ్యానాయక్, దేపల్లి రాములు, లింబ్యానాయక్, నర్సింహులు, ఎల్లప్ప, గోపాల్ పాల్గొన్నారు.