వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు కన్నెర్ర జేశారు. ఆరుగాలం శ్రమించిన పంటను వ్యాపారులు దోపిడీ చేస్తుండటంతో తిరుగుబావుటా ఎగరవేశారు. భారీగా ధర తగ్గించడంతో ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.
తేజ రకం మిర్చికి క్వింటాల్ ధర రూ. 17,200 పలుకగా వ్యాపారులు మార్కెట్లో ధర రూ.14 వేలు మాత్రమే నిర్ణయించి మిర్చి కొనుగోళ్లు జరుపుతున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మిర్చి యార్డు కార్యాలయాన్ని ముట్టడించి ఆఫీసులో పర్నీచర్ ధ్వంసం చేశారు.
అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధాన గేటు ముందు రైతులు ధర్నా చేపట్టారు. తమ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు రైతులతో మాట్లాడి ఆందోళనలు విరమించే ప్రయత్నం చేస్తున్నారు.