హైదరాబాద్ : డీలిమిటేషన్పై కేంద్రం తీరును తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుత నేడు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్న ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’కు వ్యతిరేకంగా నమక్కల్లో నల్ల జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. సదరు బిల్లు ప్రతిని దహనం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదించిన చట్టాన్ని ఆయన నల్ల చట్టంగా అభివర్ణించారు.
దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని భారీగా తగ్గించే ప్రమాదం ఉన్న ఈ పునర్విభజన బిల్లును ఆమోదించే ఉద్దేశంతోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ఈ నిరసన కార్యాక్రమాన్ని చేపట్టారు. కాగా, 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును వేగవంతం చేయడంతో పాటు రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో సహా పలు కీలక చట్టాలను లోక్సభలో ప్రవేశపెట్టేందుకు నేటి నుంచి పార్లమెంటు మూడు రోజుల ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నది.