మల్లాపూర్, జనవరి 4 : పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంతో ఉపశమనం కలుగు తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం మల్లాపూర్, ఉప్పల్ కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోశ్రెడ్డితో కలిసి ఆయన లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. లబ్ధిదారులైన మల్లాపూర్ డివిజన్కు చెందిన భారతికి రూ.18 వేలు, లక్ష్మయ్యకు రూ.36 వేలు, యోగేశ్వర్రా వుకు రూ.60 వేలు, సిద్ధివాసులుకు రూ.60 వేలు, అశోక్కుమార్కు రూ.31 వేలు, వెంకట్రెడ్డికి రూ.60 వేలు, కిశోర్కు రూ.11 వేలు, లింగమూర్తికి రూ.48 వేలు, ముఖేశ్ కుమార్కు రూ.60 వేలు, రవీందర్నాయక్కు రూ.60 వేలు, సంతోశ్కు రూ.40 వేలు, షేక్ షాహిన్కు రూ.10 వేలు, ఉప్పల్ డివిజన్కు చెందిన క్రిష్ణారెడ్డికి రూ. 60 వేలు, కిష్టయ్యకు రూ.18 వేలు, వేణుగోపాల్రెడ్డికి రూ.48 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పల్లా కిరణ్కుమార్రెడ్డి, బోదాసు లక్ష్మీనారాయణ, దుర్గయ్య, అంజిరెడ్డి, తునికి నరేశ్, రమణ, రామాంజనేయులు, జబ్బర్ఖాన్, శ్రీకాంత్, శ్రావణ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.