దుబ్బాక టౌన్/ కోహెడ, డిసెంబర్ 29 : మెరుగైన వైద్యం పొం దేందుకు పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత ఆసరాగా నిలుస్తుందని కౌ న్సిలర్ యాదగిరి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యు డు స్వామి అన్నారు. బుధవారం దుబ్బాకలో ని 14వ వార్డుకు చెందిన ఆస సబితకు రూ.16 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఆస ముత్యం, నేతలు జీడీ వెంకటేశ్, నర్సింహులు, బక్కయ్య, ప్రభాకర్, కాల్వ నర్సింహులు పాల్గొన్నారు. కోహెడ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి కి చెందిన గౌరవేని రామవ్వకు మంజూరైన రూ.28వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ భా గ్యలక్ష్మి అందజేశారు. కార్యక్రమం లో రై తు బంధు సమితి మండల కమిటీ సభ్యు డు కిషన్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రమేశ్ పా ల్గొన్నా రు. చెక్కు మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే సతీశ్కుమార్కు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.