అశ్వారావుపేట/అశ్వారావుపేట టౌన్/అశ్వారా వు పేట రూరల్, మార్చి 6: టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళాభివృద్ధికి చేస్తున్న కృషి హర్షణీయమని, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అన్నారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని పాత ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా బంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేజర్పంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, ఊట్లపల్లి సర్పంచ్ జ్యోత్స్నాబాయి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, క్షీరాభిషేకం చేశారు. అనంతరరం పలువురు మహిళలను ఎమ్మెల్యే సన్మానించి, చీరెలు పంపిణీ చేశారు. వినాయకపురం గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏడేళ్ళ పాలనలో మహిళలకు ప్రత్యే పథకాలను అమలు చేస్తూ వారి కుటుంబాల అభివృద్ధికి చేస్తున్న కృషి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, సర్పంచ్లు, రమ్య, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, టీఆర్ఎస్ నాయకులు బండి పుల్లారావు, సంపూర్ణ, రాజమోహన్రెడ్డి, యూఎస్ ప్రకాశ్, తాడేపట్టి రవి, వెంకటేశ్వరావు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి, మార్చి 6: ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. ఆదివారం పంచాయతీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు ఆధ్వర్యంలో మహిళ బంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం ఎంపీపీ సున్నం లలిత, సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ కాకా సీత, తహసీల్దార్ భద్రకాళి, ఎంపీడీవో రేవతి, వైద్యాధికారి ప్రియాంక, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందిని సన్మానించారు.కార్యక్రమంలో ఎంపీపీ సున్నం లలిత, వైస్ ఎంపీపీ మామిళ్లపల్లి రామారావు, ఎంపీటీసీ కాకా సీత, సర్పంచ్లు బోడా పద్మ, సురేశ్, రాములు, ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
చండ్రుగొండ, మార్చి 6: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలో మహిళ బంధు సంబురాలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. చండ్రుగొండలోని పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కో- ఆప్షన్ సభ్యుడు రసూల్, ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి, మార్చి 6: టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ములకలపల్లి రైతువేదికలో మహిళాబంధు సంబురాలను నాయకులు నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు అధ్యక్షతన ఆది వారం జరిగిన కార్యక్రమంలో మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, మిఠాయిలు పంచారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మట్ల నాగమణి, సర్పంచ్లు బైటి రాజేశ్, వాడే నాగరాజు, సున్నం సుధాకర్, గడ్డం భవాని, సున్నం సుశీల, కారం సుధీర్, ఎంపీటీసీ మెహరామణి, టీఆర్ఎస్ నాయకులు శెనగపాటి అంజి, సర్దార్, కోండ్రు సుందర్రావు, తోకల గోపయ్య, మాదిబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టేకులపల్లిలో మహిళాబంధు సంబురాలు తొలి రోజు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీపీ భూక్యా రాధ, సర్పంచ్ బోడ సరిత, బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేసీఆర్ చిత్ర పటానికి రాఖీ కట్టి, క్షీరాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో నాయకులు కంభంపాటి చంద్రశేఖర్రావు, బానోత్ రామానాయక్, భూక్యా సైదులునాయక్, బర్మావత్ శివకృష్ణ, వార్డు సభ్యులు భూక్యా కమల, పద్మ, ధరావత్ బుజ్జి, కాంతి, విజయ, కాళి, భద్రమ్మ, కిషన్ పాల్గొన్నారు.
ఇల్లెందు, మార్చి, 6: టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించి వారికి గౌరవం పెరిగేలా చేశారని ఇల్లెందు మార్కెట్ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్ అన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మహిళాబంధు సంబురాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ డీవీ, టీఆర్ఎస్ నాయకుడు కొక్కు నాగేశ్వరరావు, మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇల్లెందు ఏరియా సేవ, సేవా సమితి ఆధ్వర్వంలో స్థానిక సింగరేణి పాఠశాల ఆవరణలో, పాత శివాలయ క్షేత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్వంలో వైద్యులు కల్పన, కవిత సహకారంతో మహిళాబంధు సంబురాలు జరిపారు.
ఇల్లందురూరల్, మార్చి6 : టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు, మల్టీపర్పస్ ఉద్యోగులను సన్మానించారు. ఆదివారం సుభాశ్నగర్ ఏరియాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో శీలంరమేశ్, ఖమ్మంపాటి రేణుక, బండారి వెంకన్న , శీలం ఉమ, డేరంగుల పోశం పాల్గొన్నారు.