చిక్కడపల్లి :దళిత బంధుతో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటకృష్ణ (బబ్లు) ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో ప్రాణాలు త్యాగాలు చేసి దేశ ప్రజలకు స్వాతంత్య్రం తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఠా జైసింహ, తెలంగాణ హౌస్ఫెడ్ డైరెక్టర్ ఎ.కిషన్ రావు, దామోదర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, నాగభూషణం,వివేక్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే గాంధీనగర్లో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. యువ నాయకులు ముఠా జైసింహ,డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీష్, శ్రీకాంత్, రవిశంకర్ గుప్తా, శ్రీకాంత్, రాజ్కుమార్, తదితరలు పాల్గొన్నారు.
బాగ్లింగంపల్లి వీఎస్టీ కార్మిక శాఖ కార్యాలయంలో వీఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వి.శ్రీనివాస్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.