జనగామ: సీఎం కేసీఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో సీఎం కొత్త కలెక్టరేట్కు చేరుకుంటారు. 11.10 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో జనగామ అభివృద్ధిపై సమీక్షిస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతాపూర్ వద్ద నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కొత్తగా నియమితులైన టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి బాధ్యతల స్వీకరణలో సీఎం పాల్గొంటారు. అక్కడే జిల్లా పార్టీ ముఖ్యులతో సమావేశమవుతారు.
సాయంత్రం 3 గంటలకు బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. తెలంగాణపై ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత సీఎం కేసీఆర్ పాల్గొంటున్న మొదటి సభ కావడంతో ఈ సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.