హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు పబ్లిక్ గార్డెన్స్ వచ్చిన ముఖ్యమంత్రికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు.
అంతకుముందు గన్పార్కులో అమరవీరులకు సీఎం ఘనంగా నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.