యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ ఈ నెల 12న భువనగిరికి రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం పరిశీలించారు.
సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నూతన కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం భవనాలను మంత్రి పరిశీలించారు. భారీ బహిరంగ సభను నిర్వహించనుండడంతో కలెక్టరేట్ పక్కనే ఉన్న స్థలాన్ని పరిశీలించారు.
మంత్రి వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.