తిమ్మాజిపేట: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను భుజాన ఎత్తుకున్నారని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్లో షాపింగ్ కాం ప్లెక్స్, సూపర్ మార్కెట్, గోదాం, నూతన కార్యాలయాలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ రాములు, జల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్తో కలసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మాట్లాడారు. సహాకారం సంఘం అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన సీఎం కేసీఆర్కు రైతు కష్టాలు తెలుసునన్నారు. అందుకే రాష్ట్ర బడ్జెట్లో రూ.60 వేల కోట్లు పెట్టారన్నారు. గతంలో పెట్టుబడి షావుకార్లు, బ్యాంకుల తలుపులు తడితే, నేడు తెలంగాణ లో సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా రైతుల తలుపులు తట్టి పెట్టుబడి ఇస్తున్నాడన్నారు.
గతంలో దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ 2కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిస్తే, నేడు సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి వేస్తున్న పెద్దపీట కారణంగా నేడు తెలంగా ణలో 3కోట్ల మెట్రిక్ టన్నులు వరి పండి, దేశానికి అన్నం పెట్టే స్థితికి చేరుకు న్నదన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో నాలుగు వందల ఎకరాల్లో వ్యవసాయ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ఈ దిశగా సీఎం కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారని, దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసి వాటి ద్వారా మరి న్ని ఆహార పదార్థాలు తయారు చేసి, ఎగువతులు చేస్తామన్నారు.
కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన రాష్ట్రంలో 60 శాతం ప్రత్యక్ష, పరోక్ష పద్దతిలో ఉపాధి లభిస్తున్న దన్నారు. నేడు ఆగ్రో కేంద్రాల ద్వారా చాలా మంది చదువుకున్న వారు ఉపాధి పోందుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగా లు జనాభాల్లో ఒకటిన్నర శాతమే ఉంటాయని, మిగిలిన వారికి ఉపాధి అవకా శాలు ఉంటాయన్నారు.
కేసీఆర్ వ్యవసా య రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన 60శాతం ప్రత్యక్ష, పరోక్ష పద్దతిలో ఉపాధి లభిస్తుందన్నారు.. నేడు ఆగ్రో కేంద్రా ల ద్వారా చాలా మంది చదువుకున్న వారు ఉపాధి పోందుతున్నారన్నారు. దీనిపై ప్రతిపక్షాలను అవ గాహాన లేదన్నారు
ఉద్యోగాల పేరిట సన్నాసులు, ఆంధ్రా నాయకుల తొత్తులు రాద్దాంతం చేస్తున్నారన్నారు. వానాకాలం పత్తి సాగు పెంచాల న్నారు, మన పత్తికి నాణ్యమైనది మా ర్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్థుతం క్వింటాలుకు రూ. 8వేల దాక లభిస్తుం దన్నారు. యాసంగిలో ఎట్టి పరిస్థితిలో వరి సాగు శ్రేయస్కారం కాదు. కేంద్రం కొననంటుంది, వానాకాలంలో వచ్చిన దిగు బడే ఎక్కవ వచ్చిందంటున్నారన్నారు.
వరికి ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, నూగులు, పెసర, ఆవాలు, పోద్దు తిరుగుడు లాంటి పంటలు సాగు చేయాలి, వీటి పెట్టబడి తక్కువ, స్వల్ప కాలంలో మంచి దిగుబడి వస్తుందని మంత్రి తెలిపారు. రైతుల ఆలోచన దృక్పదం మారా లన్నారు. నేటి తరానికి వ్యవసాయాన్ని నేర్పితే అద్భుతం సృష్టిస్తారన్నారు.
మండలానికి 5 మేల మెట్రిక్ టన్నుల గోదాం మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ పీఎసీఎస్ ప్రజలదని ,ఇది రైతుల భాగస్వామ్యం ద్వారానే బలపడుతుందన్నారు. వచ్చే సంవత్సరం కల్లా వట్టేం, కర్వేన రిజర్వాయర్లు పూర్తి చేసి, మండలానికి సాగు నీరు అందిస్తామన్నారు.
సహాకార సంఘం బలపడితే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు,ఎరువులు,విత్తనాలు నాణ్యమైనవి తక్కువ ధరకు అందించాలన్నారు. ఈ సంఘాల ద్వారా రైతులకు మేలు చేయాలన్నారు. గ్రామాలలో రైతుల ముంగిట్లో అన్ని అందించాలన్నారు.
రైతు వేదికల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు అందుతున్నాయన్నారు. వేల కోట్లు రైతులకు అందిస్తున్నది కేవలం కేసీఆర్ మాత్రమే అన్నారు. పాలమూరు ప్రాజెక్టులు వట్టెం,కర్వేన రిజర్వాయర్ త్వరగా పూర్తి చేసి, తిమ్మాజి పేటకు సాగు నీరు అందేలా మంత్రి చోరవ చూపాలని కోరారు. ఎంపీ రామాలు మాట్లాడుతూ ముల్కనూర తరహాలో ఇక్కడి సహాకార సంఘాలు బలపడి ఆదర్శంగా తయారు కావాలన్నారు.
స్థానిక సోసైటీకి అవసరమైన సహాకారం అందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ పద్మావతిలు మాట్లాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాష, డైరక్టర్ జెక్కా రఘు నందన్రెడ్డి, రఘునాథ్రావు, విష్ణువర్దన్రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, జడ్పీటీసీ దయాకర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ కుర్మయ్య, గ్రంథా లయ సంస్థ చైర్మన్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.