హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత సీఎం కేసీఆర్ జన్మదిన సంబురాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు(15,16,17,) ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అందులో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయని మహేష్ తెలిపారు. 50 దేశాల ప్రతినిధులకు కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తూ కేసీఆర్ జన్మదిన వేడుకలు జరపాలని మహేష్ బిగాల సందేశాన్ని పంపారు.
ఈ మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు,రక్తదాన శిబిరాలు, సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు.