హైదరాబాద్ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో అమరులైన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి రూ.3 లక్షలు ప్రకటించి ఆర్థికంగా అండగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. రైతుల పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చట్టాల రద్దు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటులో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ కేంద్రాన్ని చేశారు.