హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావే త్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా విద్యానగర్లోని తన నివాసంలో శనివారం ప్రముఖ జర్నలిస్టులు కే రామచంద్రమూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ను ప్రోత్సహిస్తూ 97వ పుట్టిన రోజున మొక్కలునాటి అందరికీ ఆదర్శంగా నిలిచిన రామయ్యకు ఎంపీ సంతోష్కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సైతం రామ య్య ఇంటికివెళ్లి పాదాభివందనం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన నియోజకవర్గంలోని గూడూరుకు చెందిన రామయ్య, హైదరాబాద్ సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారని పేర్కొన్నారు.