అమరావతి,జూన్ 30: చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని, ఆయన కాంగ్రెస్ వాది కాదు అంటూ జరుగుతున్న ప్రచారం పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంచార్జులు స్పందించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు.”చిరంజీవి కాంగ్రెస్ వాదే అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ కూడా స్పందించారు. చిరంజీవి సినిమా రంగంలో బిజీగా ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
అంతమాత్రన ఆయన కాంగ్రెస్ వాది కాదు అని వార్తలు రాయడం దారుణం”అని అన్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేనప్పటికీ చిరంజీవి కరోనా సమయంలో సేవా కారక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయి. ఆయన క్రియాశీలకంగా పార్టీలో పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.